30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన నారా లోకేశ్‌..

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన నారా లోకేశ్‌..

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన నారా లోకేశ్‌..

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈనెల 27 నుంచి ఏపీలో ‘యువగళం’ పాదయాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. తెలంగాణకు చెందిన ముఖ్యనేతలతో కలిసి అక్కడిని చేరుకుని తాత ఎన్టీఆర్‌కు పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌కు లోకేశ్‌ వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున యువత ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన వాహన శ్రేణిని అనుసరిస్తూ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు..తొలుత ఇంటి వద్ద లోకేశ్‌ తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి, అత్తమామలు బాలకృష్ణ, వసుంధర కాళ్లకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన సతీమణి నారా బ్రహ్మణి హారతిచ్చారు. ఆ తర్వాత లోకేశ్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లారు. మామ బాలకృష్ణ దగ్గరుండి ఆయనకు కారు ఎక్కించారు. లోకేశ్‌ రాకతో ఎన్టీఆర్‌ ఘాట్‌కు వద్దకు పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్