34.2 C
Hyderabad
Sunday, June 1, 2025
హోమ్తెలంగాణకంటివెలుగునుసద్వినియోగం చేసుకోవాలి..

కంటివెలుగునుసద్వినియోగం చేసుకోవాలి..

కంటివెలుగునుసద్వినియోగం చేసుకోవాలి..
.
యదార్థవాది ప్రతినిది నంగునూర్

ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ నాయక్ అన్నారు. సోమవారం నంగునూరు మండలం రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి నేత్ర వైద్యం చేయించుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల వారిగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలోని 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి అక్కడికక్కడే కళ్లద్దాలు ఇవ్వడం అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఐదు రోజులపాటు ఎక్కడి వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమ విజయవంతం కోసం గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు సహకరించి సక్సెస్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నితీష్ కుమార్, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ బిక్షపతి, నాయకులు పరశురాములు ,యాదగిరి, వైద్య సిబ్బంది అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్