కార్మిక వర్గానికి ఉరితాడు బిగించాలని చూస్తున్న: బిజెపి ప్రభుత్వం
యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్
మంచిర్యాల జిల్లా పట్టణంలో రాష్ట్ర 9వ
ఐ ఎఫ్ టీ యు మహాసభలకు ఆర్మూర్
నుండి ఐ ఎఫ్ టీ యు నాయకులు ప్రతినిధులను జిల్లా ఉపాధ్యక్షులు బి సూర్య శివాజీ భారీగా తరలించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐ ఎఫ్ టీ యు నాలుగున్నర దశాబ్దల కాలంలో కార్మికుల సమస్యలపై పోరాడుతూ శ్రామికులును కూడగట్టి కార్మిక రాజ్య సాధనకై ఉద్యమిస్తుందని మోడీ సర్కార్ 8 సంవత్సరాల్లో దేశ సంపదను సహజ వనరులను కార్పోరేట్ కంపెనీలను అధిపతులకు కట్టబెట్టి కార్మికుల ఉపాధిని కొల్లగొట్టిందని నల్ల ధనం వెలికి తీసి పేదప్రజలకు జన్దన్ ఖాతాలో 15 లక్షల చొప్పున జమ చేస్తానని ఏటా రెండు కోట్ల కొలువులు ఇస్తామని ధరలను నియంత్రిస్తామని ఇచ్చిన హామీలను విస్మరించారని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను సవరణ పేరుతో నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చి కార్మిక వర్గానికి ఉరితాడు బిగించారని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఒకే భాష ఒకే మతం ఒకే ఆహారం పేరుతో భిన్న జాతుల మధ్య మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ ఉద్రిక్తత పెంచుతుందని దళిత గిరిజన మహిళ మైనార్టీ బీసీలపై నిరంతరం దాడులు జరుగుతున్న కేంద్రం పట్టించుకోకుండా ప్రజల్ని విభజించు పాలించు అన్న నీతితో విడగొడుతుందని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇచ్చిన హామీలను పక్కకు పెట్టిందని రాష్ట్రంలో 3 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ విషయాన్ని మర్చిపోవడం విచారకరమని పెరుగుతున్న ధరల కనుగుణంగా 76 రంగాల కార్మిక కనీస వేతనం జీవోలను సవరించి గెజిట్ లో ప్రచురించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర, మహాసభలను జయప్రదం చేయాలని శివాజీ గంగాధర్ కార్మిక లోకానికి కోరారు. కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు జిల్లా సహాయ కార్యదర్శి జే గంగాధర్ నాయకులు పోశెట్టి సుప్రియ,అనురాధ లక్ష్మి, ధనలక్ష్మి గోదావరి తదితరులు పాల్గొన్నారు.