కుమారులు లేక కూతురే అగ్గి పట్టి….
-కన్నీరు మున్నిరైన గ్రామస్తులు
సిద్దిపేట యదార్థవాది
సిద్దిపేట సమీపంలోని ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామం లో మంగళవారం దరిపల్లి సతవ్వ అనే వృద్ధురాలు కన్ను మూసింది. ఆమెకు కుమారులు ఎవరు లేక పోవడం తో కన్న కూతురే అగ్గి పట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. సతవ్వకు ఐదుగురు కూతుర్లు. అయితే కుమారులు ఎవరు లేక పోవడం తో చిన్న కూతురు చిన్న కూతురు లావణ్య దహన సంస్కారాలు నిర్వహించేందుకు అగ్గి పట్టింది. కుమారులు ఎవరూ లేక కూతురే అంతిమ సంస్కారాలు నిర్వహించే దృశ్యం గ్రామస్తులను కలచి వేసింది.