కూడవెల్లి ఆలయాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే
-జాతరకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేసిన చేశారు.
-ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక, యదార్థవాది ప్రతినిధి, జనవరి 22 : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట్ భూంపల్లి మండల పరిధిలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లను పరిశీలించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి స్వామి వారికీ ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు. కూడవల్లి రామలింగేశ్వర స్వామి దయతో దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు కోరారు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఈ జాతర చాలా ప్రసిద్ధి చెందిందని, ఉమ్మడి మెదక్ జిల్లా నుండి కాకుండా తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుండి మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అనేక సంఖ్యలో విచ్చేస్తారని ఎమ్మెల్యే తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధికారులకు జాతరకు సంబంధించిన ఏర్పాట్ల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎమ్మెల్యే వారికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలోఎస్టి ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.