కూడవెల్లి జాతర వేలం పాట..
దుబ్బాక: 11 యదార్థవాది ప్రతినిది
దక్షిణ కాశీగా కొలిచే కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర ప్రతిఏటా మాగ అమావాస్య రోజు నుండి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు వచ్చే భక్తులకు కొబ్బరికాయలు, లడ్డు ప్రసాదం, పుట్నాలు పేలాలు, పూలదండలు, ఇతరత్రాన దుకాణ సముదాయం కోసం గురువారం 12:30 ఆలయ ఆవరణలో వేలం పాట నిర్వహించడం జరుగుతుందని, ప్రధాన పూజారి సాకేత్ శర్మ తెలిపారు. ఈ వేలం పాట జనవరి 26 వరకు నిర్వహిస్తామని తెలిపారు.