కూరగాయలతో 11అడుగుల భారతదేశ భారీ చిత్ర పటాన్ని చిత్రించిన రామకోటి రామరాజు
యదార్థవాది ప్రతినిధి గజ్వేల్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత రామకోటి రామరాజు వివిధ రకాల కూరగాయలను ఉపయోగించి వినూతనగా భారతదేశ చిత్ర పటాన్ని అద్భుతంగా చిత్రించి బుధవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3రోజులు శ్రమించి తయారు చేశానని 11అడుగుల పొడుగుతో 8అడుగుల వెడల్పుతో చిత్రించానని తెలిపారు. గత సంవత్సరం న్యానాలతో బియ్యంతోను చిత్రించానన్నారు. ఇలా ఎన్నో రకాలుగా చిత్రాలను చిత్రించి దేశభక్తిని చాటుకున్నాడు రామకోటి రామరాజు ను ప్రతి ఒక్కరు అభినందించారు.