ఎన్నికల షెడ్యూల్ విడుదల..
యదార్థవాది న్యుడిల్లి
నోటిఫికేషన్- ఫిబ్రవరి 16
నామినేషన్లకు చివరి తేదీ- ఫిబ్రవరి 23
నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 24
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- ఫిబ్రవరి 27
ఎన్నికల పోలింగ్ -మార్చి 13
ఓట్ల లెక్కింపు- మార్చి 16
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (ECI) షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు (మొత్తం 13), తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.. ఏపీలోని ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనితో పాటు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ స్థానాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానంలో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది.