కేజీ వీల్స్ తో రోడ్లపైకి రావద్దు.. మంత్రి
నిజామాబాద్ 24 డిసెంబర్ 22
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం దేవక్కపేట, కారేపల్లి నూతనంగా వేసిన బీటీ రోడ్డుపై ట్రాక్టర్ క్రేజ్ వీల్ వాహనాల గుర్తులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రభుత్వం కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తుంటే పట్టీలు లేని కేజీవిల్స్ తో వాహనాలు నడిపి రోడ్లు నాశనం చేయడం అది కాదని, ట్రాక్టర్ యజమానులకు, ట్రాక్టర్ డ్రైవర్ లకు అవగాహన కల్పించి, ఇప్పటివరకు ఎన్ని కేజీ విల్ ట్రాక్టర్స్ పై కేసు నమోదు చేశారని పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకొని రోడ్లపై కేజీవిల్ వాహనాలు పట్టిలు లేకుండా నడపమని తీర్మానాలు చేసి మండలాలలోని తాసిల్దార్లకు అందజేయాలన్నారు. గ్రామాలు తీర్మానం చేసుకోనంతవరకు ఆయా గ్రామాల గుండా వెళ్లాల్సిన బిటి రోడ్ పనులను వాయిదా వేయాలని అధికారులకు తెలిపారు.