కేసీఆర్ పాలనలో అవినీతి ఎక్కువ: ప్రకాశ్ జవదేకర్
-2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయం.
-మోదీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి 1 లక్షా 9 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించాం.
-గత 70 ఏళ్లలో తెలంగాణలో 2 వేల కి.మీల మేరకు రోడ్లు నిర్మించింది.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
తెలంగాణలో రాష్ర్టంలో ప్రభుత్వ మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్ ఉందని కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు..
మోదీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి 1 లక్షా 9 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించారని చెప్పారు. గత 70 ఏళ్లలో తెలంగాణలో 2 వేల కి.మీల మేరకు రోడ్లు నిర్మిస్తే… మోదీ 9 ఏళ్ల పాలనలో అంతకుమించి రోడ్ల పనులు ఈ కొనసాగుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మోదీ పాలనలో 50 వేల కి.మీల మేరకు రోడ్ల పనుల నిర్మాణం జరుగుతోందన్నారు. మహజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, దూది శ్రీకాంత్, రావు పద్మ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో కలిసి హుస్నాబాద్ నియోజకర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామానికి విచ్చేశారు. ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆయన మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్రతో బండి సంజయ్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేశారని తెలంగాణలో ప్రభుత్వ మార్పు తీసుకొచ్చే సత్తా బండి మాత్రమే ఉందనే నమ్మకం నాకుందని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎట్లనో బండి సంజయ్ కూడా అట్లనే ఉన్నడని ఎంత పెద్ద పని కానీ మొదలు పెడితే పూర్తి చేసి తీరుతారని ప్రకాశ్ జవదేకర్ అన్నారు.. మోదీ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయినందున మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చానని అందులో భాగంగా ఎల్కతుర్తి –సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించేందుకు సముద్రాలలో వచ్చానని, ఈ రహదారి పనులు పూర్తయితే సిద్దిపేట, హుస్నాబాద్, ముల్కనూర్, ఎల్కతుర్తి సహా 14 గ్రామాల ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు.. కేసీఆర్ పాలనలో రోడ్ తక్కువ అవినీతి ఎక్కువని, 1948లో నిజాం పాలన నుండి తెలంగాణకు విముక్తి లభించిందని, 2 వేల 500 కిలోమీటర్లు మాత్రమే రోడ్ల పనులు జరిగితే మోదీ హయాంలో 9 ఏళ్లలోనే అంతకుమించి రోడ్ల పనులు జరిగాయని, బీజేపీ సర్కార్ అద్భుతంగా పనచేస్తుందని, మోదీ కేబినెట్ లో ఒక్క మంత్రిపై కూడా అవినీతి మచ్చ లేదని, లక్షా 9 వేల కోట్ల రూపాయలు తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఖర్చు చేసింది. 9 ఏళ్లలో 50 వేల కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల పనులు చేపట్టామని అన్నారు.. మస్కట్ నుండి వచ్చిన వ్యక్తి కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల కోసం రూ.14 వేలు ఖర్చు పెట్టారని మరి మీరెంత ఖర్చు చేశారు.. మీ అందరికీ మోదీ ఫ్రీగా వ్యాక్సిన్ డోసులను అందించారని మూడేళ్లపాటు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్న ఘనత మోదీదే. పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2.4 లక్షల ఇండ్లు ఇచ్చింది. మరుగుదొడ్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది కేంద్రమే. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానని, ప్రతి ఒక్కరూ 8919847687 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీకి మద్దతు తెలపాలని కోరుతున్నా. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తంగిడి కృష్ణారెడ్డి, హనుమకొండ అధ్యక్షులు రావు పద్మ గుజ్జ సత్యనారాయణ, అసెంబ్లీ ప్రభారీ అసెంబ్లీ పాలక్ సంతోష్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి, కోహెడ మండల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గన్నారు..