కేసీఆర్ పై మండిపడ్డ కేంద్ర మంత్రి
యదార్థవాది ప్రతినిధి న్యుదిల్లి
భారతదేశం జిడిపిలో 11వ స్థానంలో ఉంటే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటన్ ను కూడా దాటి మనదేశం 5వ స్థానంలోకి వచ్చామని, పేద ప్రజల కష్టాలను, దేశ ప్రజల కష్టాలను అవమానించే విధంగా కేసిఆర్ మాట్లాడటం తగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితి పై చర్చకు సిద్ధం ప్రగతిభవన్ లేదా ఫామ్ హౌస్ లో చర్చకు రమ్మంటారా మాట్లాడే భాష పద్ధతిగా ఉండాలి కల్వకుంట భాష కాదు తెలంగాణ భాష మాట్లాడాలి ఈ కండిషన్ పై చర్చకు సిద్ధం కిషన్ రెడ్డి దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా కేసీఆర్ మాట్లాడారు 2014 తెలంగాణ అప్పు 60 వేల కోట్లు ప్రస్తుతం ఐదు లక్షల కోట్లు పెరిగిందని, ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల అవినీతి జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ బిజెపినీ విమర్శించేదుకే తెలంగాణ అసెంబ్లీ వాడుతున్నారనీ, మండలిలో కాంగ్రెస్ లేకుండా చేసింది ఎవరు? 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాకున్నది ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు కోరుతున్నట్లు కనిపిస్తోందాని, వారితోనే జత కడుతరని, మజ్లిస్ పార్టీని పొగడని రోజంటూ ఉండదాని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేకుండా, అంతర్జాతీయ విశ్లేషణ చేసిన కేసీఆర్ తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై మాత్రం మాట్లాడటం లేదాని, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల లేక ప్రధానిని తిట్టే సమావేశాల కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత కెసిఆర్ రాజనమా చేయాల్సిందేనని కిషన్ రెడ్డి అన్నారు..