30.2 C
Hyderabad
Wednesday, March 12, 2025
హోమ్తెలంగాణకొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

యదార్థవాది కొండపాక

మండల పరిధిలోని దుద్దెడలో మార్కండేయ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సంఘ భవనంలో నిర్వహించిన వేడుకలలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాలకమండలి సభ్యులు పలువురు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజాసేవలను కొనియాడారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర అగ్ర పథాన నిలుస్తుందని కొనియాడారు. నేటితరం రాజకీయ నాయకులకు కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ జాతిపితగా గుర్తించ తగిన అన్నీ అర్హతలు కలిగిన ఏకైక వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు బొజ్జ మహాదేవు, వడ్లకొండ శ్రీనివాస్, వడ్లకొండ శ్రీహరి, బొజ్జ చక్రధర్, చిలిగాని శ్రీనివాస్, చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు వడ్లకొండ మల్లేశం, వడ్లకొండ శ్రీనివాస్, సభ్యులు కొంక ప్రభాకర్, రామచంద్రం, లక్ష్మీనారాయణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్