28.2 C
Hyderabad
Saturday, August 2, 2025
హోమ్తెలంగాణఖాత కొమురయ్య మరణం హుస్నాబాద్ ప్రజలకు తీరనిలోటు.

ఖాత కొమురయ్య మరణం హుస్నాబాద్ ప్రజలకు తీరనిలోటు.

ఖాత కొమురయ్య మరణం హుస్నాబాద్ ప్రజలకు తీరనిలోటు.

హుస్నాబాద్: యదార్థవాది ప్రతినిది

పట్టణం కస్తూరిబా కాలనికి చెందిన ఖాత కొమురయ్య అనారొగ్యంతో బాధపడుతు శనివారం సాయంత్రం మరణించారు కొమురయ్య ఆనాడు నిజాం నవాబు రజాకార్లు దొరల దొపిడి పెత్తందార్ల ఆగడాలను అరికట్టడానికి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి, రెడ్డి,గట్టెపెల్లి మురళి,గుండి దామొదర్ రావు,ముస్కు ఎల్లారెడ్డి,పిట్టల వెంకన్న,వంగపెల్లి సోమరాజం నాయకత్వంలొ సాగిన అనేక ప్రజా పోరాటాలకు ఆకర్షితుడై కమ్యూనిస్టు సావుల ఎల్లయ్య, పార్నంది రాజయ్య,గూల్ల ఆశయ్య, గడిపె పోచయ్య,లతొ కలిసి ఖాత కొమురయ్య పేదల రాజ్యం స్దాపన, సమసమాజం నిర్మాణం దున్నేవాడికి భూమి ఇవ్వలని,హుస్నాబాద్ ఏనే భూమిని పేదలందరికి పంచాలని వెట్టి చాకిరీ బానిసత్వాన్ని అంతం చేయడానికి అనేక సార్లు ప్రజా పోరాటాలు చేసి కరీంనగర్ కొర్టుల చుట్టూ తిరిగి భూములు పంచేందుకు అభ్యుదయ భావాలు కలిగిన ఆనాటి నవ యువకుడు హుస్నాబాద్ లొ వార్డు సభ్యులుగా ఎన్నికైన ఖాత కొమురయ్య పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు చేశారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ గుర్తు చేశారు. సిపిఐ నాయకులతొ కలిసి ఖాత కొమురయ్య భౌతికకాయాన్ని ఆదివారం సందర్శించి ఎర్ర జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి,ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్,పెట్టుగడి గణేష్, సిపిఐ నాయకులు ఎండి అక్బర్,వడ్లూరి మల్లయ్య కస్తూరిబా కాలనికి వాసులు మహిళలు,విద్యార్థులు, యువకులు,రైతులు కూలీలు,అసంఘటిత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్