సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది . షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ ప్యానెల్ బోర్డులో మంటలు ఎగిసిపడ్డాయి . ఆందోళన చెందిన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు . ప్రమాదం స్వల్పమైనదేనని అగ్నిమాపక అధికారులు తెలిపారు