22.9 C
Hyderabad
Sunday, September 14, 2025
హోమ్తెలంగాణగుడిసే వాసుల గోడు పట్టించుకోండి..

గుడిసే వాసుల గోడు పట్టించుకోండి..

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పేదలకు చెందవలసిన సంక్షేమ పథకాలు ఇప్పటి చేరలేదు చాడ వెంకటరెడ్డి..

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన70 ఏడ్లు గడిచిపోయినప్పటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పేదలకు చెందవలసిన సంక్షేమ పథకాలు ఇప్పటి చేరలేదు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇంటి స్థలాలు, పక్క ఇండ్లులేక గత 40 సంవత్సరాలుగా పూరి గూడిసెల్లొ మగ్గుతున్న పాలక, ప్రభుత్వ అధికారులు పేద ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండలం కూచనపెల్లి గ్రామంలో జరిగిన సిపిఐ గ్రామ శాఖ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గుడిసే వాసుల గోడు పట్టని పాలకవర్గం. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి గుడిసెలు వేసుకొని జివనం సాగిస్తున్నా పేద ప్రజలకు ఇంటి నివేశన స్థలాల పట్టాలు, రెండు పడకల ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవలని చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు బొయిని అశోక్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి యెడల వనేష్, రైతు సంఘం మండల కార్యదర్శి అయిలేని సంజివరెడ్డి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొహెడ కొమురయ్య,భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్, సిపిఐ మండల నాయకులు పుదరి రఘుపతి, ఇంద్రాల మల్లయ్య, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి చెప్యాల సిద్ధయ్య, యువతి, యువకులు,మహిళలు, రైతులు కూలీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్