24.1 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్గుణదల మేరీ మాత ఉత్సవాలకు పటిష్ట భద్రత

గుణదల మేరీ మాత ఉత్సవాలకు పటిష్ట భద్రత

గుణదల మేరీ మాత ఉత్సవాలకు పటిష్ట భద్రత

యదార్థవాది ప్రతినిధి విజయవాడ

నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్ ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ నగరంలో ది.09.02.2023 తేదీ నుండి జరగనున్న గుణదల మేరీ మాత ఉత్సవాల సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లును పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా పరిశీలించారు బంధోబస్త్ ఏర్పాట్లలలో లా & ఆర్డర్ ట్రాఫిక్ పార్కింగ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు, సిబ్బంది, టెంపుల్ నిర్వాహకులకు తగు సూచనలు సలహాలను అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు రోజులపాటు విజయవాడ నగరంలో జరగనున్న గుణదల మేరీ మాత ఉత్సవాల సందర్భంగా ఎక్కడా ఎటువంటి అవంచనీయ జరుగకుండా 1500 పోలీస్ అధికారుల సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ముఖ్య ప్రదేశాలలో సి.సి.కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, మూవింగ్ పార్టీలను ఏర్పాటు చేసి భక్తుల రద్దీ ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేశారు అనంతరం పోలీస్ కమీషనర్ గుణదల మేరిమాత టెంపుల్ కి వచ్చే అన్ని రహదారులలో పర్యటించి పార్కింగ్ ట్రాఫిక్ ఎక్కడా అంతరాయం లేకుండా ఏర్పాటు చేయు బందోబస్త్ విషయమై ట్రాఫిక్ డి.సి.పి. కె. శ్రీనివాసరావు కి తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కె. శ్రీనివాసరావు సెంట్రల్ ఏ.సి.పి. ఖాధర్ బాషా మాచవరం ఇన్స్పెక్టర్ కగుణారామ్, ట్రాఫిక్ అధికారులు సిబ్బంది మరియు మేరీ మాత టెంపుల్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్