గ్రామా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి
యదార్థవాది ప్రతినిది
గ్రామ దేవతలకు జాలబిషకేకం నిర్వహించి గ్రామంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆలూర్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ది కమిటీ అద్వర్యంలో గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం నిర్వహించిన గ్రామస్తులు.. గత కొన్ని సంవత్సరలుగా గోదావరి నది జలాలు తీసుకువచ్చి గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు.. ఆదివారం విడిసి కార్యాలయం వద్ద ప్రారంభం అయిన శోభ యాత్ర అన్ని దేవాలయాలను కలుపుతూ గ్రామ ప్రధాన వీధుల గుండా కొనసాగించారు, పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు రోగాల భారిన పడకుండా కాపాడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బందు సమితి డైరెక్టర్ ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేష్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బార్ల గణపతి, కళ్లెం సాయిరెడ్డి, ఎడ్ల పోశెట్టి, రఘుపతి, కొత్తూరు గిరీష్, సంజీవ్, నారాయణ, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గోన్నారు..