గ్రామీణ రైతులకు ఘనంగా సన్మానం..
సిద్దిపేట 23 డిసంబర్
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా స్థానిక న్యూ విజేత పాఠశాల మరియు స్పైస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో22 శుక్రవారం విద్యార్థులతో కలిసి స్థానిక ఇమాంబాద్ లో ఉన్న శ్రీమతి శ్రీ రాధారం లక్ష్మి-రంగయ్య దంపతుల యొక్క వ్యవసాయ క్షేత్రంలో పర్యటించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులందరూ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న రైతు దంపతులను పంటలు ఎలా పండిస్తారో, ఏ విధంగా నీళ్లు పెడతారో, ఏ విధంగా పంటను కోస్తారు మొదలగు విషయాలు మరియు ఆకుకూరలు, కూరగాయలు మొదలగు పంటలను ఎలా పండిస్తారు అని అడిగి తెలుసుకున్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు చేస్తున్న కృషిని ఆ రైతులకు వివరిస్తూ, రైతు దేశానికి వెన్నెముక లాంటివాడని రైతు కష్టం చేయకపోతే మానవజాతికి మనుగడనే లేదని రైతుల యొక్క కృషిని కొనియాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు యాజమాన్య బృందం అందరూ కలిసి ఆ రైతు దంపతులు శ్రీమతి శ్రీ రాధారం లక్ష్మి రంగయ్య మరియు స్థానిక లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతు మహిపాల్ రెడ్డి గార్లను ఘనంగా సన్మానించడం జరిగినది.జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో అక్కడున్న ప్రాంతమంతా మారుమోగేలా నినాదాలు చేస్తూ ఆ రైతు దంపతులకు జేజేలు పలికినారు. ఇట్టి కార్యక్రమంలో స్పైస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ గుండ్ల రవికుమార్, ఎర్రబోలు శ్రీకాంత్ రెడ్డి మరియు న్యూ విజేత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చాతరాశి రవి గారు పాల్గొనడం జరిగినది.