గ్రామ దేవతలతో సుఖ సంతోషాలు: ఎమ్మెల్యే చింత
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిధి
సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో పోచమ్మ తల్లి మందిరం పునర్నిర్మాణం పనులను ప్రారంభించిన సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందిర నిర్మాణాలు మానసిక ఉల్లాసానికి ప్రతితి మందిరాల లొ పూజలు భజనలు జరుగుతూ ఉంటే ఎల్లప్పుడూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఇట్టి కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించినందుకు ఎంతో సంతోషిస్తున్నానని మద్దికుంట గ్రామ ప్రజలు నాపై చూపిన ఆదరాభిమానాలు నేను ఎన్నటికీ మర్చిపోలేనని గ్రామ ప్రజలను భక్తులనుదేశించి అన్నారు ఈ పోచమ్మ తల్లి దీవెనలతో గ్రామ ప్రజలు నియోజకవర్గ ప్రజలు కూడా ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సమీనా అంజుమ్ ఎంపీపీ తొంట యాదమ్మ కిష్టయ్య సొసైటీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడిల సుధీర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పెద్ద గొల్ల ఆంజనేయులు అరి పొద్దీన్ ఎంపిటిసి అల్లం లలిత సర్పంచ్ అశోక్ సొసైటీ ఉపాధ్యక్షులు పాండు నాయక్ డైరెక్టర్ విట్టల్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ అరిఫ్ మాజీ ఎంపిటిసి శివకుమార్ బిఆర్ఎస్ నాయకులు మరకల రాజు సురేష్ గ్రామ శాఖ అధ్యక్షులు పాషా గ్రామ పెద్దలు యాదయ్య తుల్జారెడ్డి హరీష్ తదితర నాయకులు పాల్గొన్నారు.