29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఘనంగా దొడ్డి కొమురయ్య 77 వ వర్ధంతి

ఘనంగా దొడ్డి కొమురయ్య 77 వ వర్ధంతి

ఘనంగా దొడ్డి కొమురయ్య 77 వ వర్ధంతి

హుస్నాబాద్ యదార్థవాది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 77 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురు ఐలయ్య, వీర్ల లింగయ్య, మ్యాకల ఓదయ్య, కోట అశోక్, చెంచు సంపత్, మ్యాకల రమేష్, చెంచు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్