ఘనంగా దొడ్డి కొమురయ్య 77 వ వర్ధంతి
హుస్నాబాద్ యదార్థవాది
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 77 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురు ఐలయ్య, వీర్ల లింగయ్య, మ్యాకల ఓదయ్య, కోట అశోక్, చెంచు సంపత్, మ్యాకల రమేష్, చెంచు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.