ఘనంగా సైన్స్ డే
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబిటస్ పాఠశాలలో మంగళవారం సైన్స్ డే నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ తమ సైన్స్ ఎగ్జిబిట్లను సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించారు ఈ సందర్భంగా అంబిటస్ పాఠశాల డైరెక్టర్ జ్యోతి రెడ్డి మాట్లాడుతూ నోబెల్ బహుమతి గ్రహీత భారత రత్న సర్ సి వి రామన్ కనిపెట్టిన రామన్ ఎఫర్ట్ కనుగొన్నది ఫిబ్రవరి 28 అందుకని 1987 సంవత్సరం నుండి ఫిబ్రవరి 28 న జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని సైన్స్ ప్రతి ఒక్కరి జీవితంతోను ముడిపడి ఉందని మనిషి దైనందిన జీవితంలో సైన్స్ ఒక భాగమని కాబట్టి ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పధాన్ని అలవరచుకోవాలని సైన్స్ అభివృద్ధి చెందడం వలన ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతుందని మన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త కొత్త ఆవిష్కరణలు కొత్త విషయాలు కనుగొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు