విద్యార్థులే ఉపాధ్యాయులైతే వారి ఆనందం
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
యదార్థవాది ప్రతినిది మెదక్
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం బూరుగుపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో శనివారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్న పదవ తరగతి విద్యార్థులు. విద్యార్థులు ఉపాధ్యాయులై వారి అనుభూతులు అభిప్రాయాలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయులుగా సిహెచ్ శివ, డీఈఓ గా చిట్యాల అనిల్, డిప్యూటీ డిఈఓ గా ఈర్ల రుచిత, ఎంఈఓ గా పి రాఘవరెడ్డి, వ్యవహరించారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎస్ఎంసి చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.