27 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ రాజ్ ఘాట్ వద్ద లోకేష్ ఘన నివాళి.

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ రాజ్ ఘాట్ వద్ద లోకేష్ ఘన నివాళి.

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ రాజ్ ఘాట్ వద్ద లోకేష్ ఘన నివాళి.

ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టాలి.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

న్యూఢిల్లీ యదార్థవాది

ఆంధ్రప్రదేశ్ లో గాడి తప్పిన పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలని మంగళవారం ఢిల్లీలోని రాజ్ఘా ఘాట్ వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి ఎంపిలు కే. రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, రాష్ట్ర మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆడారి కిషోర్ కుమార్ మత్మునికి నివాళి అర్పించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలను జాతీయ పార్టీల నేతల దృష్టికి తీసుకు వెళ్లేందుకు గత ఆరు రోజులుగా దేశ రాజధాని హస్తినలో ప్రత్యక్ష నిరసనలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయాల్లో నేరుగా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఢిల్లీలో ఏపి లో పరిస్థితులపై దృష్టి పెట్టి, చక్కదిద్దలని మహాత్మునికి విన్నవించామన్నారు. ఈ పర్యటనలో ఏపీ భవన్ వద్ద, జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కూడా చేయడం జరిగిందని సోమవారం పార్లమెంట్ వద్ద నేషనల్ మీడియా పాయింట్ వేదిక గా జాతీయ మీడియాలతో మాట్లాడామని తెలిపారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రోజు నుంచి ఏ ఒక్కరోజు కూడా రాజ్యాంగ బద్దంగా వ్యవహరించలేదని, చట్టాలను తమ చట్టం గా చేసుకుని అత్యంత భయంకరమైన క్రూర చర్యలకు దిగబడ్డారని, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు నుంచి సామాన్య కార్యకర్తల వరకూ ప్రతిరోజూ. ప్రత్యక్ష నరకం అనుభవిస్తూన్నారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగానికి లోబడి పని చెయ్యవలసిన అధికారులు రూల్స్ ను ఏనాడో తుంగలోకి తొక్కారన్నారు. ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడి ను అత్యంత పాశవికంగా అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యడం పై మండిపడ్డారు. ఏమాత్రం పసలేని, సంబంధం లేని , ఆధారం లేని స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ స్కీం లో చంద్ర బాబు నూ అరెస్ట్ చెయ్యడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఈయన దార్శనికత ఆధారంగా సుమారు 5 లక్షల మంది స్కిల్స్ లో శిక్షణ తీసుకుని దేశ విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. సాక్షాత్తు అభియోగం మోపబడిన సిమెన్స్ సంస్థ అధిపతులే ఈ స్కీం లో ఎటువంటి స్కాం జరగలేదని చెప్పి నా మొండి పట్టుదల తో అధికార పార్టీ వెళ్తోందని వీళ్ళ మూర్ఖపు ధోరణి వల్ల ప్రజలు చాల ఇబ్బదులకు గురవ్తున్నారని దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసులు పెట్టడం లో పెట్టిన శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెడితే బాగుంటుందన్నారు. బాబు పై జరిగిన కుట్రను ఖండిస్తూ పార్టీలకతీతంగా ముందుకు రావాలని ఢిల్లీ నుండి పిలుపునిస్తున్నామన్నారు. ఈ పర్యటన లో నేషనల్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ దళిత జే ఏ సీ అధ్యక్షులు ఆలూరి రాజేష్, ఢిల్లీ తెలుగు సంఘాల ప్రతినిధులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్