చెన్నమనేని పిటీషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు
సిరిసిల్ల, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: కోర్టును తప్పుదోవ పట్టించినందుకు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. సుదీర్ఘ కాలంగా కొట్లాడుతున్న కేసులో గెలుపొందిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..15 ఏండ్లుగా చెన్నమనేని రమేష్ చేస్తున్న మోసాలను బయటపెడ్తున్నారు.
దశాబ్దన్నర కాలంగా చెన్నమనేని రమేష్ ప్రభుత్వాన్ని, కోర్టును, వేములవాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడని ఆది శ్రీనివాస్ అన్నారు..
చెన్నమనేని పిటీషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు..15 సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది..
విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని, ఇందుకు చెన్నమనేని రమేష్ కు 30 లక్షల జరిమానా విధించిన హైకోర్టు.. ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు, 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని చెన్నమనేని రమేష్ కు హైకోర్టు ఆదేశం..
ఆది శ్రీనివాస్ తరఫున సీనియర్ అడ్వకేట్లు రవి కిరణ్ రావు, రోహిత్ వాదించారు..