చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు యువకుడి మృతి
కొహెడ/జయదేవ్ పూర్ యదార్థవాది
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన బొడిగే రాజు జగదేవ్ పూర్ మండలం ధర్మారం గ్రామంలోని బొరబండ చెరువులో చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు..దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు రాజుకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరితో కలివిడిగా వుండే రాజు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దినసరి కూలీగా చేపల వేటకు వెళ్తూ జీవనం సాగించే రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.