జర్నలిస్టుల చిరకాలవాంఛ నెరవేర్చిన: జగన్ మోహన్ రెడ్డి
3 సెంట్లు ఇళ్ళ స్థలాలు’ కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం
అమరావతి యదార్థవాది ప్రతినిది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని జర్నలిస్టుల చిరకాల వాంఛ నెరవేర్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మేడవరపు రంగనాయకులు మాట్లాడుతూ.. శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ‘జర్నలిస్టులకు 3 సెంట్లు ఇళ్ళ స్థలాలు’ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆమోదించడం శుభపరిణామం అన్నారు. ఇది నిజంగా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కుటుంబాల్లో వెలుగు నింపే విషయమని హర్షం వ్యక్తం చేశారు. స్వతహాగా జర్నలిస్టుల సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రిగా జర్నలిస్టుల శ్రేయస్సు కోరుతూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ సీఎం జగన్ కు, మంత్రులకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.