జాతీయ రహదారిపై కారు బీభత్సం ముగ్గురు యువకులు మృతి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం జాతీయ రహదారిపై నంద్యాల వైపు నుండి కడప కు వస్తున్న కారు టైరు పేలడంతో ఆళ్లగడ్డ నుండి సిరివెళ్లకు మోటార్ సైకిల్ పై వెళ్తున్న నలుగురు యువకులపై కారు పల్టీ కొడుతూ బైక్ పై పడడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో, సమాచారం అందుకున్న, డి ఎస్ పి కే రాజేంద్ర, సీఐ కృష్ణయ్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సమీప ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు.