జిల్లాలో అకాల వర్షాలపై సమీక్షించిన: మంత్రి కేటిఆర్
సిరిసిల్ల యదార్థవాది
జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలపైన మంత్రి కె. తారక రామారావు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్ పి, వ్యవసాయ అధికారిలతో చరవాణిలో జిల్లా పరిస్థితులపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అనుకోకుండా కురిసిన అకాల వర్షాల వలన నష్టపోయిన జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు బారోస కల్పించాలని మంత్రి తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగంమంతా క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని అధికారులతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులంతా రైతులకు అందుబాటులో ఉండాలని జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రతి ఒక్కరు తమ తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అండగా ఉండాలని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు భరోసా ఇవ్వాలని మంత్రి సూచించారు.