
జిల్లా యువజనోత్సవాలు
సిద్దిపేట: 4 జనవరి
క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా యువజనోత్సవాలు సిద్దిపేట విపంచి కళా నిలయంలో జిల్లా యువజన సంక్షేమ, క్రీడా శాఖ అధికారి నాగేందర్, సెట్విన్ కోఆర్డినేటర్ అమీనా భాను పర్యవేక్షణలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధకృష్ణ శర్మ, ట్రైనింగ్ కలెక్టర్ ఫైజన్ అహ్మద్ హజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని యువత యొక్క శక్తి సామర్థ్యాలను దేశాభివృద్ధికి పునరంకితం చేయాలని దేశానికి యువశక్తి బలమని యువత సన్మార్గంలో నడిచి వారి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనరు. జానపద నృత్యాల విభాగంలో గెలుపొందినవారికి భాహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, న్యాయ నిర్ణేతలు చంటి,నరసింహులు,సుభాష్, స్వామి,జిల్లా యువజన సంఘాల సమితి జిల్లా ఉపాధ్యక్షుడు అధికం రాజుగౌడ్, చేపూరి విజయ్ కుమార్ గౌడ్,అర్జున్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.








