తల సేమియా కోసం రక్తదాన శిబిరం
ఆర్మూర్, యదార్ధవాది ప్రతినిధి, డిసెంబర్ 14: నిజానాబాద్ జిల్లా ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గంగాదేవి యూత్ అసోసియేషన్ సభ్యులు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో తల సేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొమ్ముల వినోద్ రెడ్డి, మంగళారపు భూమేష్ లు మాట్లాడుతూ చిన్నపిల్లల కోసం యువత ఎప్పుడు ముందుకు వచ్చి రక్తదానం చేసి వారి పానాలను కాపాడాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్ట ప్రదీప్, కేకే వెంకట్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మేకల ప్రవీణ్, సాయి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.