తిప్పారం గ్రామంలో అంగన్వాడి పోషణ పక్షం కార్యక్రమం
యదార్థవాది కుకునూరు పల్లి
తిప్పారం గ్రామ అంగన్వాడి రెండవ సెంటర్ లో పోషన పక్షం కార్యక్రమం సిడిపిఓ శారద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంగన్వాడి టీచర్లతో ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు చిరుధాన్యాలపై తల్లులకు గర్భిణీ స్త్రీలకు కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ పక్షం అంటే చిరుధాన్యాలతో కూడిన ఆహారం అని,వాటిని గర్భిణీ స్త్రీలు బాలింతలు వినియోగించుకోవాలని సూచించారు. చిరుధాన్యాలతో ఆహారం తీసుకోవడం వలన నూట్రిసిన్స్ పెరుగుతాయని, గర్భిణీ స్త్రీలు బాలింతలు బలంగా ఉంటారు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ మాధవి పోషణ అభియాన్ టీం నెంబర్స్ రాము కనకరాజు తిప్పారం అంగనవాడి టీచర్స్ భోగి శ్యామల కోరే విజయలక్ష్మి హై స్కూల్ టీచర్స్ సుగుణాకర్ శశిరేఖ ప్రైమరీ స్కూల్ టీచర్ తిరుమలేష్ కుకునూరుపల్లి సెక్టర్ అంగన్వాడీ టీచర్స్ తల్లులు బాలింతలు కిశోర బాలికలు గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.
