27 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణతుమ్మలతో రైతు ప్రతినిధుల సమావేశం

తుమ్మలతో రైతు ప్రతినిధుల సమావేశం

తుమ్మలతో రైతు ప్రతినిధుల సమావేశం

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి

హైదరాబాద్ లో మంగళవారం  సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను రైతు ప్రతినిధులు వ్యవసాయ కార్యాలయంలో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రైతు బంధు అమలు ధరణి పోర్టల్ సమస్యలు రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్ రుణమాఫీ కౌలు రైతులకు పెట్టుబడి సాయం కల్తీ విత్తనాలు ఎరువులను ఏ విధంగా అరికట్టాలి సేంద్రియ ఎరువులు బహుళ అంతస్తుల వ్యవసాయ పద్దతులు డ్రిప్ చిరు ధాన్యాల సాగు తో పాటు ప్రాసెసింగ్ మామిడి తదితర పండ్ల  ప్రాసెసింగ్  మద్దతుధరలు ఆయిల్ పామ్ సాగు- ప్రాసెసింగ్ శీతల గిడ్డంగులు ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. భూసార పరీక్షలు ఆధారంగా పంటల సాగు మీద దృష్టి సారించడం ద్వారా రసాయన ఎరువులు వాడకం గణనీయంగా తగ్గే అవకాశముంది. పర్యవసానం గా భూసార పరిరక్షణ కు అవసరం అయిన  రీతిలో నేల భౌతిక రసాయన గుణాలు మెరుగు పడుతుంది అని రైతులు అనుభవాలను మంత్రికి వివరించారు. మల్టీ లేయర్ వ్యవసాయం ద్వారా ఒక స్థిరమైన ఆదాయం సంవత్సరం పొడవునా లభించే అవకాశం ఉందని ఆ పద్దతులను ప్రవేశ పెట్టాలని మంత్రిని కోరారు. కృషి విజ్ఞాన కేంద్రాలు భూసార పరీక్షలు బహుళ అంతస్తుల వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు  అవగాహన తో పాటు ఆచరించటం లో భాగస్వామ్యం అందుకునేలా చేయటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని మంత్రికి తెలిపారు. మార్కెట్లో రైతులకు అన్యాయం జరుగకుండా మద్దతు ధర కనీసం దొరికేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ బాధ్యతలను నిజాయితీ గా నిర్వహించేలా చేయాలని, అదేవిధంగా పంటల ఉత్పత్తుల అదనపు విలువ చేకూరేలా ప్రాసెసింగ్ అవసరమని శీతల గిడ్డంగులు వసతి  అవసర మైన రీతిలో కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అన్ని అంశాలను సావధానంగా వినటమే కాకుండా ఒక రైతు గా తన అనుభవాలను కూడా ప్రతినిధులతో పంచుకున్నారు. నిరంతరం మనం అందరం కలిసి అన్ని అంశాల గురించి చర్చల ద్వారాఉమ్మడి అవగాహన తో  ముందుకు సాగుదాం అని రైతు ప్రతినిధుల బృందంతో తెలిపారు. జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి ఖమ్మం జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు తెలంగాణ కిసాన్ సెల్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి భూముల సమస్యలపై న్యాయ సలహాదారు ప్రొఫెసర్ సునీల్ చేతన సొసైటీ అధ్యక్షులు ప్రొఫెసర్ డి. నరసింహ రెడ్డి రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వర రావు వ్యవసాయ శాస్త్రవేత్త ఆల్టస్ జానయ్య ఈ సమావేశంలో పాల్గొని ఈ అంశాలపై చర్చించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్