తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా!
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్- 2 పరీక్ష వాయిదా పడినట్లు సమాచారం ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ వాయిదా పడింది. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు అయితే ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయటంతో తెలంగాణలో గ్రూప్-2, 783 పోస్టులకు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థుల దరఖాస్తు చేశారు అయితే గ్రూప్ -2 ఎగ్జామ్ డేట్ రీ షెడ్యూల్ చేస్తారా లేక కొత్త పోస్టులను చేర్చి రీ వైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది ఇప్పటి వరకు తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇవ్వలేదు ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రివ్యూ చేసింది గ్రూప్- 2 ఎగ్జామ్స్ పై తెలంగాణ సర్కార్ స్పష్టత కాలేదు అయితే ఇప్పటికి ఎన్నిసార్లు పరీక్షను వాయిదా వేస్తారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పలుమార్లు ఎక్సామ్ వాయిదా పడటంతో పలువురు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు.