త్వరలో పశువైద్య కళాశాలకు శంకుస్థాపన
సిద్దిపేట యదార్థవాది
సమీకృత జిల్లా కార్యలయ సముదాయ సమీపంలో 30 ఎకరాల విస్థిర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న పశువైద్య కళాశాలకు కేటాయించిన ప్రాంతాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. టిఎస్ఎంఎస్ఐడిసి ఇంజనిర్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీ, పశువైద్య యూనివర్సిటీ బృందం, ఎడి సర్వేయర్, స్థానిక తహసిల్దార్ అందరు కలిసి మ్యాప్ ద్వారా కళాశాల నిర్మాణం గుర్చి వివరించారు. కళాశాల ఆవరణ చుట్టూ 10 మి ఒకటి చొప్పున స్తంభాలు పాతాలని ఎడి సర్వేయర్ వినయ్ కుమార్ కి తెలిపారు. ఆవరణలో పెద్ద పెద్ద కరెంట్ స్తంభాలు తియ్యడానికి డిమాండ్ నోటిస్ తయారు చేయ్యాలని విద్యుత్ శాఖ ఎస్ఇకి తెలిపారు. భవిష్యత్తు తరాలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నిర్మాణ ఎస్టిమేట్ టెండర్ ను పైనల్ చెయ్యాలి. స్థలాన్ని చదును తర్వాత అతి త్వరలో జిల్లా మంత్రి హరీష్ రావు చే శంకుస్థాపన కార్యక్రమానికి సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.