34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణదివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న: రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్

దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న: రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్

దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న: రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్

– దేశంలో దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

– పనిచేసే ప్రభుత్వాన్ని దివ్యాంగులు ఆశీర్వదించాలి..

– హుస్నాబాద్ నియోజకవర్గం లో 11, 800ల దివ్యాంగులు..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ లో నియోజకవర్గ స్థాయిలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం పోతారం (ఎస్) శుభం గార్డెన్ లో నిర్వహించారు. ఆదివారం ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్, స్ధానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ బాబు, హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశంలో దివ్యాంగులను గుర్తించి దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ 4016 రూ. ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమని, దేశంలో బిజెపి, కాంగ్రెస్, ఇతర పార్టీలు పాలిస్తున్న ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో ఇచ్చినట్లుగా పెన్షన్లు ఇవ్వటం లేదని ఎద్దేవా చేశారు ఇది సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా వుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కేవలం సతీష్ కుమార్ తోనే సాధ్యమని మూడోసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నరు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొప్ప మానవతావాదని, దివ్యాంగులకు అడగకుండానే 4016 రూపాయల పెన్షన్ ఇస్తూ దివ్యాంగులకు అండగా నిలిచాడని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా దివ్యాంగులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు మనల్ని ఆదరించలేదన్నారు. దివ్యాంగులకు అవసరమైన వారికి వీల్ చైర్లు వాహనాలు కూడా అందిస్తున్నారని మరొకసారి రాష్ట్రంలో దివ్యాంగులు బీఆర్ఎస్ పార్టినే గెలిపించుకోవాలని ఇది మన ప్రభుత్వం అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ పిలవగానే పెద్ద ఎత్తున హాజరైన దివ్యాంగులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 11,800 మంది దివ్యాంగులు ఉన్నారని ప్రతినెల 4,73,88,800 రూపాయలు అందిస్తున్నామని మూడవసారి హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మీ చల్లని మనసుతో ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో నాయకులు శీలం రాజిరెడ్డి, మెడబోయిన వెంకటేష్, నవీన్ రెడ్డి,సరిత ,ఆవుల పద్మ, రాజు ,సంపత్, రాజశేఖర్ రెడ్డి, సమ్మయ్య, లింగయ్య, కనకయ్య, శ్రీనివాస్, బిక్షపతి, సత్తయ్య ,తదితరులు హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చిన దివ్యాంగులు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్