25.2 C
Hyderabad
Friday, February 7, 2025
హోమ్తెలంగాణదేవాలయ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం!

దేవాలయ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం!

దేవాలయ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం!

యదార్థవాది ప్రతినిది వేములవాడ

దేవాలయ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు అన్నారు.. మున్సిపల్, వి.టి.డి.ఏ అధికారులతో కలెక్టర్ అనురాగ్ జయంతి, శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబుతో రివ్యూ మీటింగ్ బుధవారం నిర్వహించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే 6మాసాల్లో 50కోట్ల పనులను పూర్తి చేస్తామని, మొదటిది బద్దీపోచమ్మ దేవాలయం విస్తరణలో భాగంగా 2 గుంటల్లో ఉన్న దేవాలయాన్ని 18కోట్లు నష్టపరిహారం ఇచ్చి 1 ఎకరం స్థలం దేవాలయం కొరకు తీసుకోవడం జరిగిందని, ఆ స్థలంలో బోనాలు తీసే మహిళలకు బోనాల మంటపం, మంచి క్యూ కాంప్లెక్స్ ఇలా మంచి సౌకర్యాలు ఏర్పాటు, రెండవది 10కోట్లతో గుడి చెరువు సుందరీకరణ తో పాటు 800 మీటర్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు, మొదటి విడతగా తిప్పాపురం గుడివరకు రోడ్ల వెడల్పు, ఫుట్ పాత్ ల నిర్మాణం చేస్తామని తెలిపారు. శివార్చన లో అద్భుతమైన కళాఖండాలు ఆవిష్కృతమయ్యాయో అలాంటి వాటికోసం సాంసృతిక, వేద పాటశాలలు ఎలాగైతే ఉన్నాయో వాటితో పాటు నృత్యం గానం కళాశాలను ఏర్పాటు చేసుకొని వాటికి భవనాలు కూడా గొప్పగా నిర్మించబోతున్నామని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జెడ్.పి చైర్మన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి, వి.టి.డి.ఏ ఆర్కిటెక్ట్ ముక్తేశ్వర్, వి.టి.డి.ఏ సెక్రెటరీ భుజంగరావు, ఎస్టేట్ ఆఫీసర్ గంప సత్యనారాయణ, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్