దేశ ప్రజల బతుకుల్లొ
చికటి నింపుతున్న బిజెపి.
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
కేంద్రంలో అధికార బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలు వాడుతున్న వంటగ్యాస్ పై అనేక సార్లు అడ్డు అదుపు లేకుండా వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపును వెంటనే విరమించు కోవాలని సిపిఐ జాతీయ, రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలొ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ కార్యకర్తలతో కలిసి నిరసన తెలియజేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి గడిపె మల్లేశ్ మాట్లాడుతూ దేశ ప్రజల గోడు పట్టని బిజెపి పేదలను కృంగదిసేవిదంగా ధరలను పెంచడం అన్యాయమని వెంటనే ఉపసంహరించుకోవాలని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను అనేక రకాల నిత్యావసర వస్తువుల ధరలు, డిజిల్, పెట్రోల్, వంట నూనేలు ఉప్పు పప్పు దినుసులు వంట గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెంచి అన్ని వస్తువులపై జిఏస్టిని పెంచి దేశ ప్రజలపై అధిక భారం వేసిందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అనలొచిత నిర్ణయం వల్ల ధరలు పెరిగి దేశ ప్రజలు అల్లాడి పోతున్నారని పెంచిన వంట గ్యాస్ సిలిండర్ల, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకురావాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో బిజెపి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి భారత దేశ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని గడిపె మల్లేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.