దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయులకు ఘన నివాళి
యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్
భారతదేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా
నివాళులర్పించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం అలుపెరగని మహనీయులు సుఖ్ దేవ్ రాజ్ గురు భగత్ సింగ్ ల బలిదానాలను స్మరిస్తూ వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొవలని మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని స్వతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వనికి నిద్ర లేకుండా చేసిన యువ వీర కిశోరాలు సుఖదేవ్ భగత్ సింగ్ రాజ్ గురు. “ఇన్కలాబ్ జిందాబాద్” అనే నినాదం వీరితోనే పుట్టిందని భారత మాత కోసం ఉరికోయ్యల్ని ముద్దాడి నవ్వుతూ “మేరారంగ్ దే బసంతీ చోలా” అంటూ తమ రక్తం తో హోలీ జరిపిన భారత మాత ముద్దు బిడ్డలు చనిపోయి జీవించడం అంటే ఏంటో చూపించారని వారి త్యాగాలని సంస్మరించుకుంటూ ఆ స్పూర్తితో మనం కూడా దేశ భక్తిని ని గుండెల్లో నింపుకుందామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కస్తూరి ప్రవీణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంచెపు ఆనంద్ బీసీ అధ్యక్షుడు కారంపూరి రవి కుమార్ యువజన అధ్యక్షులు అంకార్ గణేష్, సంతోష్ సాగర్ సాయి రాం మహిళ నాయకులు రేఖ రాణి తదితరులు పాల్గొన్నారు.