నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలి
యదార్థవాది ప్రతినిది యదాద్రి
యాదగిరిగుట్ట మండలంలో ఉన్న అన్ని గ్రామాల నాయి బ్రాహ్మణ సోదరులకు షేవింగ్-కటింగ్ కీట్స్ అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట మండలంలో తాళ్లగూడెం గ్రామంలో నాయి బ్రాహ్మణులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. మీరు రాజకీయాల్లో ముందు ఉండాలని, పని చేసే నాయకుడికి పట్టం కట్టాలన్నారు, మనమంతా ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. నాయి బ్రాహ్మణులు ఉదయం నుండి రాత్రి వరకు నిలబడి కష్టపడతరని, ప్రభుత్వం వెంటనే 50 ఏళ్లకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల ఎంపీపీ చీర శ్రీశైలం, మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, నాయి బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు ప్రకాష్, ప్రధానకార్యదర్శి సోన్నాయిల రమేష్, బండి నర్సింహులు, జంపాల రాము, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు..