
నిఘా నేత్రంలో రహదారి..
పెద్దపల్లి: 4 జనవరి
* నిఘా నీడలో రాజీవ్ రహదారి, సుల్తానాబాద్ మున్సిపాలిటీ..
* సిసి కెమెరాతో మనిషిలో మార్పు వస్తుంది..
నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలక పాత్రపోషిస్తాయి పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి.. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 18 కిలోమీటర్ల దూరం రాజీవ్ రహదారి పై 29 సీసీ కెమెరాలు ఏర్పాటు, డివైడర్ కటింగ్ వద్ద హైమాస్ లైట్లు,09 హైవోల్ట్జి లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్” లో సుల్తానాబాద్ మున్సిపాలిటీ ప్రజల సహకారం తో 52, 81 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరినింది. బుదవారం సీసీ కెమెరాలను రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (ఐజి), పెద్దపల్లి డీసీపీ రూపేష్ లతో కలసి ప్రారంభించరు. ఈ సందర్భంగా ఎస్. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో, కాలనీలలో, కార్పొరేటర్స్, వ్యాపారస్తులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. దేశంలోనే సీసీ కెమెరాల ఏర్పాటు లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ, ఏచిన్న సంఘటన, రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని, నేరా నియంత్రణలో ముఖ్య పాత్ర వహిస్తాయన్నారు. సిసి కెమెరాల వలన మనిషి నడవడిలో క్రమశిక్షణ తో కూడిన మార్పు వస్తుందని తెలిపారు. 81 సీసీ కెమెరాలు ఏర్పాటు కు కృషి చేసిన ఏసీపీ, సీఐ, ఎస్ఐ, ఏర్పాటు కు సహకారం అందించిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి సారణంగాపాణి సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేన రెడ్డి, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఎస్ ఐ ఉపేందర్, వినీత ,అశోక్ రెడ్డి , పోత్కపల్లి ఎస్ఐ మహేందర్ జూలపల్లి వెంకటకృష్ణ ఎస్ఐలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









