నిరుపేద వధువు వివాహానికి ఆర్థిక సాయం..
దుబ్బాక ఎమ్మెల్యే ఆదేశాలతో వధువు వివాహానికి బీజేపీ కార్యకర్తలు ఆర్థిక సాయం అందజేత..
దౌల్తాబాద్ యదార్థవాది
దౌల్తాబాద్ మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన మంగ విజయ్ మంగ సంతోష దంపతులు గత కొన్నిసంవత్సరాల కిందట మృతి చెందారు.. తల్లి తండ్రి మృతితో ముగ్గురు ఆడపిల్లలు ఒక కుమారుడు నలుగురు చిన్నారులు అనాథలయ్యారు. బుధవారం పెద్ద కూతురు శిరీష వివాహం విషయం తెలుసుకున్న గ్రామ బీజేపీ శాఖ అధ్యక్షుడు దుర్గారెడ్డి కార్యకర్తలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్లగా నిరుపేద వధువు వివాహానికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్ల చందు, మరికంటి భాస్కర్, దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు..