నూతన బస్సులను ప్రారంభించిన: ఎమ్మెల్యే
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
నూతన సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హుస్నాబాద్ లో బస్ డిపో లేకుండా చేస్తున్నారని రాద్దాంతం చేసిన ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడు డిపోకు కొత్తగా బస్సులు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. హుస్నాబాద్ డిపోకు రెండు సూపర్ లగ్జరీ బస్సులు కావాలని అడగగానే వారం రోజుల్లో డిపోకు రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఇప్పించిన మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..రెండు బస్సుల్లో ఒక బస్సు హుస్నాబాద్ వయా సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్తుందని, మరొక బస్సును హుస్నాబాద్ వయా జనగాం, యాదగిరిగుట్ట మీదుగా హైదరాబాద్ కు నడుస్తాయని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని బస్సు సర్వీస్ లో పెంచి డిపోను అభివృద్ధి చేస్తామన్నారు. హుస్నాబాద్ బస్టాండ్ నుండి వివిధ రూట్లలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యకమములో హుస్నాబాద్ చైర్పర్సన్, ప్రజా ప్రతినిధులు, బిఅరేస్ నాయకులు పాల్గొన్నారు.