నేడు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న వృద్ధులు: జేడ్ చైర్ పర్సన్ అరుణ
సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు.. అదివారం తెలంగాణ ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమం కోసం చేపట్టిన అనేక పథకాల వివరించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందుతున్న విధానం అలాగే వృద్ధులు ఆత్మగౌరవం తోటి జీవిస్తున్న విషయం గురించి వివరించారు. అలాగే జిల్లాలో ఎల్లారెడ్డిపేటలో మండేపల్లిలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్వహణ గురించి అలాగే వయో వృద్ధులకి ఫిజియోథెరపీ సేవలు వివిధ పథకాల కింద అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వయోవృద్ధుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని దాన్లో భాగంగా వారి హక్కులను కాలరాసే పిల్లలపై చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారం ఉందని వివరించారు. ఆకునూరి శంకరయ్య జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని అవగాహన చేసుకుని ప్రేమతో చూసుకోవాలని, తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు. వాళ్లు వయసులో మాత్రమే వృద్ధులని అనుభవంలో మరింత జ్ఞానం పొందిన వారని వివరించారు. కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఓటు హక్కు గురించి అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహులు ఓటు హక్కు గురించి, ఓటు వేసే విధానం గురించి, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనందం మాట్లాడుతూ ఆస్తిపాస్తులు లాగేసుకొని నిర్లక్ష్యం వహిస్తే ఫిర్యాదు చేసి తగు న్యాయం పొందవచ్చని సూచించారు ఈ సందర్భంగా వయావృద్ధుల హెల్ప్ లైన్ సేవల గురించి, హెల్ప్ లైన్ 14567 అందిస్తున్న సేవల గురించి, వయోవృద్దుల సంక్షేమ శాఖ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మి రాజం వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చేపూరు బుచ్చయ్య, కార్యదర్శి డా .జనపాల శంకర్, కోశాధికారి వెల్దండ దేవదాసు, డి హబ్ కో ఆర్డినేటర్ రోజా, సిడిపివోలు ఆనందిని, సుచరిత, సఖి కేంద్రం పద్మ, టీఎన్జీవో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు ఫీల్ రెస్పాన్స్ ఆఫీసర్ సంతోష్ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు.