నేను వద్దన్నా కేసీఆర్ వినలేదు కేఏ పాల్
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
నూతన సచివాలయం లో అగ్నిప్రమాదం సంఘటనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ స్పందించారు అంబేడ్కర్ సెక్రటేరియట్ను కేసీఆర్ పుట్టిన రోజు ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ కూలగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ”నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది. నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. దేవుడు కూడా కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడికి నచ్చకనే సెక్రటేరియెట్కు వ్యతిరేకంగా నిలబడ్డాడు” అంటూ వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఎంతో కాలం చెల్లదని… కేసీఆర్ ఇప్పటికైనా పశ్చాత్తాపడి మారాలని సూచించారు. కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగానే గెలవరని.. ఇక ప్రధాని ఏం అవుతారని ఆయన ఎద్దేవా చేశారు అంబేడ్కర్ జయంతి రోజే సెక్రటేరియట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు