నేరాల నియంత్రణకు ఇంటర్సెప్టర్ పోలీస్ వాహనాన్ని ప్రారంభించిన: జిల్లా ఎస్పీ అఖిల్
సిరిసిల్ల యదార్థవాది
సిరిసిల్ల జిల్లాలో ధర్నాలు రాస్తారోకోలు వద్ద అవాంఛనీయ సంఘటనలు రికార్డు చేసే అధునాతన టెక్నాలజీ పోలీస్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణనే ప్రధాన ఉద్దేశ్యంతో ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం నమ్మకం మరింత పెరిగేలా జిల్లాలో మొట్టమొదటగా ఇంటర్సెప్టర్ పోలీస్ వాహనాన్ని ప్రారంభించామని సిరిసిల్ల టౌన్, వేములవాడ టౌన్ లో నిత్యం తిరుగుతూ ర్యాలీలు, ధర్నాలు, అల్లర్లు జరిగినప్పుడు ఈ వాహనంలో 360°గలా కేమెరా తో ఇద్దరు డ్రిస్టిక్ గార్డ్ సిబ్బంది రికార్డ్ చేసి ఉన్నత అధికారులకు తెలియజేస్తారని అన్నారు. కార్యక్రమంలో ఆర్.ఐ రజినీకాంత్, టౌన్ సి.ఐ అనిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.