న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 68వ వర్ధంతి.
సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: న్యాయవాదుల సంఘం సిద్దిపేట ఆధ్వర్యంలో జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షాడగొండ జనార్ధన రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పాటు స్వతంత్రం సిద్ధించిన పాకిస్తాన్ ఇప్పటికీ ఆర్థిక రాజకీయ సామాజిక అస్థిరతగా ఉందని, కానీ భారతదేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్ల స్థిరత్వంగా ప్రభుత్వాలు, ప్రజలు, శాంతియుతంగా జీవిస్తున్నామంటే అది అంబేడ్కర్ ఆలోచనవల్లే అన్నారు, మనగలుగుతున్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కాంతారావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ముదిరాజ్, కోశాధికారి కర్రోళ్ల బాబు, మహిళా రిప్రెసెంటేటివ్ కే.సూర్యకళ సీనియర్ న్యాయవాదులు చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ నాయిని బాలయ్య, తుంగ కనకయ్య, ఏ.బాపూరావు, ఆత్మ రాములు, మల్లికార్జున్, ఆదినారాయణ యాదవ్, కమాలుద్దీన్, బాబు, సాగర్, మహిళా న్యాయవాదులు లావణ్య,అనురాధ తదితర న్యాయవాదులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.