పంచాయతీ కార్మికులకు న్యాయం జరిగే వరకు సిపిఐ పార్టి అండగావుంటుంది: చాడ
-రాష్ట్రంలో కార్మికుల దిగిపోయె దినం దగ్గర పడుతున్నా నేటికి గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు మారలేదు.చాడ వెంకటరెడ్డి..
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
నిత్యం పారుశుద్య పనుల్లో నిమగ్నమై ఏండ్ల తరబడి గ్రామపంచాయటి కార్మికులు పనిచేస్తున్నా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల దిగిపోయె దినం దగ్గర పడుతున్నా నేటికి గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు ఏమాత్రం మారలేదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె చేస్తున్న సందర్భంగా దీక్ష శిబిరాన్ని సిపిఐ నాయకులతో కలిసి సందర్శించి కార్మికుల సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని రిటైర్మెంట్ వయస్సు వచ్చిన కార్మికులకు పర్మినెంట్ చేయకుండా కెసిఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని గ్రామ పంచాయతీలో చదువుకున్న కార్మికులను అర్హతల ఆధారంగా పంచాయితీ కార్యదర్శులు నియమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్తి న్యాయం జరిగేంత వరకు కార్మికుల పక్షాన పోరాటం సాగిస్తామని అయన అన్నారు.
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, తెలంగాణ వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బొయిని అశోక్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్, అక్కన్నపెట,కొహెడ మండలలా కార్యదర్శులు కొమ్ముల భాస్కర్, ముంజ గోపి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర,జిల్లా నాయకురాల్లు గూడెం లక్ష్మి, గూడ పద్మ, సిపిఐ నాయకులు అయిలేని మల్లారెడ్డి, నిమ్మ ధర్మారెడ్డి, బూడిద సదాశివ, మ్యాకల సంపత్ సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.