పగటి వేశగాళ్ళ మాటలు నమ్మొద్దు.
కొండపాక యదార్థవాది
మండల పరిధిలోని దుద్దెడ కాశవారి పల్లెలో శుక్రవారం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నూనె కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ మాత్రమేనని పగటి వేశగాళ్ళ వలే కాంగ్రెస్ బిజెపి పార్టీల వారి మాటలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని వాళ్ళ మాటలు విని ఓటును వృధా చేసుకోకూడదని ఇంటికి పెద్ద కొడుకు లాగా తెలంగాణ ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో కే సీ ఆర్ నిలిపాడన్నరు. మన అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపిస్తే రాబోయే ఐదేళ్లలో ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ ఎండి హఫీజ్ ఎండి హసన్ ఎండి. మోయిన్ ఎండి నయీమ్ ఎండి హాలీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.