పట్టణంలో వ్యక్తి దారుణ హత్య
నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని మిర్చి కంపౌండ్ లో ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన యూసుఫ్ (45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు యూసుఫ్ తోపాటు. మరో ఇద్దరు ఓ ట్రాన్స్ పోర్టు కార్యాలయం ఎదుట ఆదివారం రాత్రి నిద్రించారు. ఆ ముగ్గురిలో యూసుఫ్ దారుణ హత్యకు గురి కాగా.. మిగతా ఇద్దరు వ్యక్తులు ఉదయం నుంచి అక్కడ కనిపించలేదు. యూసుఫ్ తో పాటు అక్కడ పడుకున్న ఇద్దరు వ్యక్తులే..యూసుఫ్ గొంతుకోసి హత్య చేసారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్ పోర్టు యజమాని పోలీసులకు సమాచారం అందించగా.. వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి, ఎస్సై మొగులయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించారు. యూసుఫ్ తోపాటు నిద్రించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.