పల్లెల్లో అభివృద్ధి జరుగుతుంది. ఎమ్మెల్యే గండ్ర
యదార్థవాది ప్రతినిది భూపాలపల్లి
గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెల్లో అభివృద్ధి జరుగుతుంది భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి..టేకుమాట్ల మండలంలోని రాఘవపూర్, గర్మిళపల్లి, బుర్ణపల్లి, వెంకట్రావ్ పల్లి గ్రామాలలో రూ.80లక్షలతో అంతర్గత (CC) రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంజూరైన నిధులతో పాటు మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నామని, గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెల్లో జరుగుతున్నయని, అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలు బిఆర్ఎస్ పార్టికి అండగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.